News

కరవు పరిస్థితులను పరిశీలించిన చినరాజప్ప


అనంతపురం జిల్లాలోని రాప్తాడు మండలం గంగులకుంటలో కరవు పరిస్థితులను మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, పరిటాల సునీతలతో కలిసి డిప్యూటీ సీఎం చినరాజప్ప పరిశీలించారు. రాష్ట్రంలో కరవు నివారణ చర్యలు చేపడతామని చెప్పారు. అనంతపురం జిల్లాలో రెండు లక్షల ఎకరాల్లో వేరుశనగ పంటకు నష్టం వాటిల్లిందని, కరవు నివారణ చర్యలు చేపడతామని చినరాజప్ప వెల్లడించారు. పట్టణాల్లో తాగునీటి కోసం ముప్పై కోట్లు , గ్రామాల్లో నీటిసరఫరాకు వంద కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు.